మద్యం షాపుల టెండర్లు ఈసారి బోసిపోయాయి. గతంతో పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వస్తున్నాయి. ఒక్కో షాపునకు వేల దరఖాస్తుల నుంచి వందలకు, పదులకు సంఖ్య పడిపోయింది. 2,620 మద్య షాపులకు గతంలో దాదాపు 1.3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి మెదక్, మహబూబ్నగర్లలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో టెండర్ల అప్లికేషన్ల సంఖ్య పెంచేందుకు ఎక్సైజ్ అధికారులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.