మద్యపాన రహిత గ్రామంగా దుర్గంచెరువు.. మార్పు దిశగా కీలక అడుగు..

1 month ago 10
వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలంలోని దుర్గంచెరువు గ్రామం సామాజిక మార్పులో ఆదర్శంగా నిలిచింది. గ్రామస్థుల ఆరోగ్యం, కుటుంబాల ఆర్థిక అభివృద్ధి, శాంతిభద్రతలను మెరుగుపరచడమే లక్ష్యంగా గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తూ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మద్యం కారణంగా కుటుంబాలు చితికిపోవడాన్ని గమనించిన సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ నిర్ణయం పట్ల ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article