ఏపీ ప్రభుత్వం పౌర సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు మన మిత్ర వాట్సాప్ గవర్నె్న్స్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. సుమారుగా 800 పైచిలుకు సేవలను వాట్సాప్ గవర్నె్న్స్ ద్వారా అందిస్తు్న్నారు. అయితే ఇప్పటి వరకూ ఎంతమంది మన మిత్ర వాట్సాప్ సేవలు ఉపయోగించుకున్నారనే లెక్క లను అధికారులు వెల్లడించారు. ఆర్టీజీఎస్ గురించి సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు ఇప్పటి వరకూ 1.43 కోట్ల మంది మన మిత్ర సేవలు ఉపయోగించుకున్నట్లు వివరించారు.