విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం సమావేశం ఒంగోలులో జరిగింది. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. ఒంగోలులోని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వంద మందికి పైగా విద్యావేత్తలు, నిపుణులు ఇందులో పాల్గొన్నారు. మన విద్యాలయాల్లోకి పాశ్చాత్య పెడ ధోరణులు ప్రవేశిస్తున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. విలువలతో కూడిన విద్యను అందించే అంశంపై చర్చించారు.