ACB Caught Osmania University DE: మరో రెండు నెలల్లో రిటైర్మెంట్ దగ్గర పడుతున్న ఓయూ డీఈ రాకొండ శ్రీనివాసులు, మానేరు హాస్టల్ పనులకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి రూ.11 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. రూ.7 లక్షల బిల్లు విడుదల చేయాల్సి ఉండగా, అందుకోసం రూ.11 వేలు లంచం డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ, డబ్బులు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ వార్త స్థానికంగా కలకలం రేపింది.