Dommeti Birth Anniversary State Festival Om March 23: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రతి ఏటా మార్చి 23వ తేదీన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పండుగగా నిర్వహించనుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో హామీ ఇవ్వగా.. ఇప్పుడు నెరవేర్చారు.