సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన దాతృత్వంతో మరోసారి వార్తల్లో నిలిచారు. అనారోగ్యంతో సహాయం కోసం వచ్చిన ఆరుగురు బాధితులకు అండగా నిలిచి.. వారి చికిత్స నిమిత్తం తన సొంత నిధుల నుండి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. గతంలోనూ సదాశివపేటలో క్యాన్సర్ బాధితురాలైన ఆమని అనే మహిళకు లక్షల రూపాయల సాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత గుట్కా, సిగరెట్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి కుటుంబాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు.