హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హెచ్ఎండీఏ మరోసారి కోకాపేట నియోపోలిస్లో 25 ఎకరాల భూమిని వేలం వేయడానికి సిద్ధమవుతోంది. దీని ద్వారా రూ.3 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఇక్కడ ఎకరా భూమి రూ.100 కోట్లకు పైగా పలకడంతో, ఈసారి కూడా భారీ స్పందన ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్లో భూముల వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఆదాయం నగరం అభివృద్ధికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.