గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి బదిలీపై వెళ్లిన జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ డి.రమేశ్లు తిరిగి ఏపీ హైకోర్టుకే రానున్నారు. వీరితో పాటు మరో న్యాయమూర్తి జస్టిస్ట్ సుభేందు సమంత కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెదం తెలిపారు. అనంతరం కేంద్ర న్యాయ శాఖ.. నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ డి.రమేశ్లు ఆంధ్రప్రదేశ్కు చెందినవారే కావడం గమనార్హం.