మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. డోర్నకల్ జంక్షన్ వద్ద ట్రాక్లు నీట మునగడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గితేనే రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ అని అధికారులు తెలిపారు.