మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ నేత కొండా ప్రశాంత్ రెడ్డి హత్య కుట్ర భగ్నమైంది. రూ. 2.5 కోట్లకు సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకున్న దుండగులు రెక్కీ నిర్వహించగా.. ప్రశాంత్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కర్నూలు, అనంతపురం, కర్ణాటకకు చెందిన రౌడీషీటర్లు, స్థానిక యువకుడు కుట్రలో పాల్గొన్నట్లు ఆడియో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.