మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో.. కార్గో, పార్సిల్ వస్తువుల వేలం.. ఆ లిస్ట్ ఇదే..

3 months ago 11
హైదరాబాద్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కార్గో ద్వారా బుక్ చేసిన వస్తువులు.. గమ్యస్థానాలకు చేరిన తర్వాత కూడా ఎవరూ తీసుకెళ్లని (Unclaimed) పార్సిళ్లను బహిరంగ వేలం వేయాలని టీజీఎస్‌ఆర్‌టీసీ అధికారులు నిర్ణయించారు. ఈ వేలం ప్రక్రియ జనవరి 22న ఉదయం 10 గంటలకు ఎంజీబీఎస్ పార్సిల్ గోడౌన్ ఆవరణలో ప్రారంభం కానుంది. వేలంలో ఉంచే వస్తువుల్లో ఎలక్ట్రిక్ పరికరాలు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, ప్లాస్టిక్ వస్తువులు, ఐరన్ సామగ్రి, ద్విచక్ర వాహన విడిభాగాలు మరియు దుస్తులు ఉన్నాయి. ఆసక్తి గలవారు నేరుగా వేలంలో పాల్గొని వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
Read Entire Article