రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి సీట్ల సంఖ్య పెరుగుతుందని.. మహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లు కేటాయించే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాజేంద్రనగర్లోని వన మహోత్సవం-2025 కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. మహిళా సంఘాలకు రూ. 21 వేల కోట్ల బ్యాంకు లింకేజీ ఇచ్చామని, ఇందిరా శక్తి క్యాంటీన్లు, బస్సుల కొనుగోలు, సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటులో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.