వినాయక చవితి సందర్భంగా తెలంగాణ మహిళలకు ప్రధాని మోదీ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 15 మంది మహిళలకు 3.5 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోలను ఉచితంగా పంపిణీ చేశారు. పీజీ, బీటెక్ చదివిన నిరుద్యోగులు సైతం ఈ ఆటోలు పొందడం విశేషం. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.