ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. మంగళవారం రోజున విద్యుత్ శాఖపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా త్వరలోనే ఏపీకి వేయి విద్యుత్ బస్సులు రానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు పల్లెలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.