మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా పేదరికం నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్నామని.. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. హైటెక్ సిటీలో 'సరస్ మేళా'ను ప్రారంభించిన ఆమె.. మహిళా సంఘాలకు మరిన్ని వ్యాపార అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.