తెలంగాణ మహిళా సంఘాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ పథకాల అమలులో ఎలాంటి ఆలస్యం జరగకూడదని భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చూడాలని సూచించారు.