హైదరాబాద్లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు అదనపు ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాలని నిర్ణయించింది. తొలి దశలో 40 నుండి 50 సంఘాలకు ఈ బస్సులు అందజేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నగరంలో మహిళా సంఘాల సంఖ్యను లక్షకు పెంచడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. మరోవైపు,..రాబోయే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. పేద విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.