ఉచిత బస్సు పథకం మాకొద్దు అంటూ మహిళలు రోడ్డెక్కి నిరసన చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమకు ఫ్రీ బస్ అవసరం లేదని.. డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కునే స్థోమత తమకు ఉందంటూ పేర్కొన్నారు. మహిళలను చూస్తేనే ఆర్టీసీ డ్రైవర్లు బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తమను చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.