పల్నాడు జిల్లాలో శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆరోపణలపై మాజీ మంత్రి విడదల రజిని, అప్పటి గుంటూరు ఆర్వీఈవో, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా ఇంకా కొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. విజిలెన్స్ తనిఖీల పేరుతో డబ్బులు వసూలు చేసినట్టు ఫిర్యాదు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. దీంతో విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.