Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు వాసుల దశాబ్దాల నాటి సుద్దగెడ్డ వాగు సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిష్కారం చూపారు. ఆయన హామీ మేరకు రూ.2 కోట్లతో వంతెన నిర్మాణం పూర్తి కావడంతో, వర్షాకాలంలో ప్రజలు, విద్యార్థులు పడే ఇబ్బందులు తీరనున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు పవన్కు ఘన స్వాగతం పలకారు. ఇచ్చిన మాట ప్రకారం తమ సమస్యను పరిష్కరించినందుకుగాను పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలిపారు.