ఏపీ జేఏసీ అమరామతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ నెల 28వ తేదీన రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలను ప్లే చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది. దాంతో బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు రావాల్సిన డబ్బులు, మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను మాత్రమే అడుగుతున్నామని.. తమది ఉద్యోగుల అజెండానే అని, రాజకీయ అజెండా కాదంటూ ఆయన తేల్చి చెప్పారు.