Reservations: తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు సామాజిక న్యాయం చేయాలని మాదిగ సామాజికవర్గ నేతలు కాంగ్రెస్ పార్టీని కోరారు. ముఖ్యంగా.. 18 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, అందుకు అనుగుణంగా సీట్ల కేటాయింపు చేయాలని వారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ , మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సహా పలువురు నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు.