ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒకేచోట 80 పాము పిల్లలు దర్శనమిచ్చాయి. మార్కాపురం అటవీ శాఖ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్కాపురం శివారు ప్రాంతంలో ఇటీవల పాము గుడ్లు కనిపించాయి. స్థానికులు దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వటంతో స్నేక్ క్యాచర్ వాటిని సేకరించారు. మార్కాపురం అటవీ శాఖ కార్యాలయంలో పొదగబెట్టారు. 120 పాము గుడ్లు పొదగబెడితే.. వాటిలో నుంచి ఏకంగా 80 పాము పిల్లలు బయటకు వచ్చాయి. ఈ విషయాన్ని స్నేక్ క్యాచర్ నిరంజన్ వెల్లడించారు.