మాలిలో ముగ్గురు భారతీయులు, ఒక చైనా జాతీయుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. కిడ్నాప్ అయిన వారిలో తెలుగు వ్యక్తి కూరాకుల అమరలింగేశ్వర రావు, ఒడిశాకు చెందిన పాండ వెంకటరమణ, రాజస్థాన్కు చెందిన ప్రసాద్ ఉన్నారు. జూలై 1న అమరలింగేశ్వర రావు పుట్టినరోజు కాగా, అదే రోజు ఉగ్రవాదులు దాడి చేసి అపహరించారు. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించి, బాధితులను రక్షించడానికి కృషి చేస్తోంది.