మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్జీఏ చీఫ్ దేవా సహా 20 మంది సభ్యులు అత్యాధునిక ఆయుధాలతో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిలో రూ.75 లక్షల రివార్డు ఉన్న దేవా, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి, ఆయన భార్య ఉన్నారు.