మావోయిస్టు పార్టీ సభ్యులు వరుసగా లొంగిపోతున్నారు. దీంతో పార్టీలో తీవ్ర సంక్షోభం నెలకొంది. కీలక నేతలు లొంగిపోతున్న నేపథ్యంలో.. పార్టీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, అభయ్ పేరుతో లేఖలు రాస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ.. జాతీయ మీడియా వరుస కథనాలు ప్రచురిస్తోంది. అయితే దీనిపై మావోయిస్టు పార్టీ గానీ, లొంగిపోయిన వారు గానీ స్పందించలేదు. కాగా, ఇటీవల లొంగిపోయిన నేతలను విప్లవ ద్రోహులుగా అభివర్ణిస్తూ అభయ్ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే.