ఐర్లాండ్లో జరిగిన మిస్ ఇండియా యూనివర్స్ 2026 అందాల పోటీల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు సత్తా చాటారు. వైరాకు చెందిన నిఖిత ఫస్ట్ రన్నరప్గా నిలవగా.. వరంగల్కు చెందిన రాజరాజేశ్వరి మూడో రన్నరప్గా నిలిచారు. డబ్లిన్లో నిర్వహించిన ఈ పోటీలో 18 మంది భారతీయ యువతులు ఫైనల్స్కు ఎంపిక కాగా.. 3 రౌండ్లుగా సాగిన పోటీలో అందంతో పాటు ధైర్యం, ఆత్మవిశ్వాసం, అపజయాలను ఎదుర్కొనే తీరు వంటి అంశాలను పరిశీలించారు.