నేటి ఆధునిక యుగంలో వాట్సాప్ మోసాలు పెరిగిపోయాయి. కరీంనగర్ జిల్లాలో పీఎం కిసాన్ పథకం పేరుతో రైతులను మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డబ్బులు జమ అవుతాయని నమ్మించి, ఖాతాల నుంచి వేలకు వేలు కాజేశారు. గుర్తు తెలియని లింక్లను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.