తెలంగాణ ప్రభుత్వం అర్హుల కోసం కొత్త రేషన్ కార్డుల జారీని వేగవంతం చేసింది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ‘డైనమిక్ కీ రిజిస్టర్’ (డీకేఆర్) గణాంకాల ప్రకారం.. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఒక్క నవంబర్ నెలలోనే 4,917 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో మొత్తం కార్డుల సంఖ్య 11,52,477కు చేరుకుంది. యూనిట్ల సంఖ్య పెరగడంతో బియ్యం కోటా కూడా పెరిగి 22,099 టన్నులకు చేరింది. ఈ చర్యతో నిరుపేదలకు ఆహార భద్రత మరింత బలోపేతమైంది.