ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో కామారెడ్డి జిల్లాలో ఒక వ్యక్తి రూ. 18.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఫేస్బుక్లో పరిచయమైన మహిళ ఆశ చూపడంతో ట్రేడింగ్ యాప్లో పెట్టుబడి పెట్టాడు. లాభాలు వచ్చినట్లు చూపించి, డబ్బు విత్డ్రా చేసుకోవడానికి అదనంగా రూ. 22 లక్షలు అడగడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.