మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న డీసీపీ సరిత.. విజయవాడ గుణదలలోని కొండప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఏడుస్తున్న ఓ బాలుడిని గమనించి అతడిని ఓదార్చారు. అత్త కొట్టిందని ఏడుస్తున్న బాలుడిని.. భవిష్యత్తులో ఏం అవుతావని అడిగారు. ఆర్మీ అధికారి అవుతానని చెప్పగా.. ఆర్మీ ఆఫీసర్ అలా కంటతడి పెట్టొద్దని చెప్పారు. అనంతరం బాలుడిని కొట్టిన కుటుంబ సభ్యులను మందలించారు. అనంతరం ఫోన్ మానేసి లక్ష్యంపై దృష్టి సారిస్తానని బాలుడు డీసీపీకి లేఖ రాశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.