మీర్పేట మాధవి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన మరదలితో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేలింది. మాజీ ఆర్మీ అధికారి అయిన నిందితుడు, భార్యను ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి, ఎముకలను పొడి చేసి చెరువులో పారేశాడు. డీఎన్ఏ పరీక్షలు నిందితుడి నేరాన్ని నిర్ధారించాయి.