ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శుక్రవారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం రోజున అసెంబ్లీ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో బోండా ఉమా, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. సమస్యను విన్న వెంటనే వేగంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.