టీటీడీకి మరోసారి భారీ విరాళం అందింది. ముంబైకి చెందిన ఓ సంస్థ టీటీడీ నిర్వహించే బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి 50 లక్షల రూపాయలు విరాళంగా అందించింది. ఆదివారం రోజున జీన్ అండ్ బొమ్మాన్జీ దుబాష్ ఛారిటీ ట్రస్టు సీఎఫ్వో విరాళానికి సంబంధించిన డీడీని ఆలయ అధికారులకు అందించారు. మరోవైపు కార్తీక పర్వ దీపోత్సవం సందర్భంగా డిసెంబర్ నాలుగో తేదీన తిరుమలలో కొన్ని సేవలను టీటీడీ రద్దు చేసింది.