బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప-ఎన్నిక జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, ఇక్కడ గెలిచి తీరాలనే సంకల్పంతో అధికార కాంగ్రెస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం.. తాము అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలే ఓట్లను కురిపిస్తాయనే ఆశలు పెట్టుకుంది. బీఆర్ఎస్ సెంటిమెంట్ను నమ్ముకుంది. గోపీనాథ్ భార్య సునీతను తమ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందిే. అయితే, కాంగ్రెస్ బీసీలకు టిక్కెట్ కేటాయించింది.