గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నాన్స్టాప్గా మోగిన మైక్ సెట్లు మూగబోయాయి. ఇక అభ్యర్థులు, పార్టీలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈనెల 11న పోలింగ్ జరగనుండగా.. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల కోసం అధికారులు అన్నీ సిద్ధం చేశారు. ఈనెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ తర్వాతి రోజు మేయర్, డిప్యూటీ మేయర్.. ఛైర్పర్సన్, డిప్యూటీ ఛైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది.