kaleshwaram temple hundi income: తెలంగాణలోని కాళేశ్వర క్షేత్రం వద్ద జరిగిన సరస్వతి పుష్కరాలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ పన్నెండు రోజుల వేడుకకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్కరాల సందర్భంగా ఆలయానికి రూ.2.83 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీకి కూడా సుమారు రూ.8 కోట్ల ఆదాయం లభించింది. సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. బంగారం, వెండి కానుకలు కూడా లభించాయి.