తెలంగాణలో గ్రామాల్లో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి గ్రామాల్లో ప్రత్యేకంగా మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ముగ్గురు పిల్లల నిబంధన కారణంగా పలువురు ఆశావాహులు ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లల నిబంధనపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేసింది.