తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుంది. నిజామాబాద్లో జరిగిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మరో రెండు మూడు రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని.. ఫిబ్రవరిలో పోలింగ్ జరుగుతుందని ప్రకటించారు. సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల వంటి పథకాలు పార్టీకి విజయవకాశాలను పెంచుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామని.. ప్రలోభాలకు తావులేదని స్పష్టం చేశారు.