AP Municipal Workers Welfare Package: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ ఒప్పంద, పొరుగు సేవల కార్మికులకు శుభవార్త అందించింది. యాక్సిస్ బ్యాంకుతో ఎంవోయూ కుదుర్చుకుని, వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించింది. సహజ మరణానికి రూ.4 లక్షలు, ప్రమాద మరణానికి రూ.20 లక్షలు, విమాన ప్రమాదంలో రూ.కోటి పరిహారం, పిల్లల చదువులకు రూ.8 లక్షలు, రూ.4 లక్షల వరకు రుణ సదుపాయం వంటివి కల్పించారు. ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.