మూగ జీవాలపై క్రూరత్వం.. 250 వీధి కుక్కలకు విషం ఇచ్చి చంపేశారు.. ఆ జిల్లాలోనే..

5 months ago 17
ఎన్టీఆర్ జిల్లాలోని వెలగలేరు గ్రామంలో దారుణం జరిగింది. 250 వీధి కుక్కలను విషపూరిత ఇంజెక్షన్లతో చంపి.. రహస్యంగా పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఒక జంతు సంరక్షణ సంస్థ వెంటనే స్పందించి.. పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. కాగా, జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘించి.. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article