ఎన్టీఆర్ జిల్లాలోని వెలగలేరు గ్రామంలో దారుణం జరిగింది. 250 వీధి కుక్కలను విషపూరిత ఇంజెక్షన్లతో చంపి.. రహస్యంగా పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఒక జంతు సంరక్షణ సంస్థ వెంటనే స్పందించి.. పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. కాగా, జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘించి.. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ సిబ్బంది ఈ దారుణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.