ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీల గ్రేడ్ పెంచింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ గ్రేడ్ను.. స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్కు, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీని గ్రేడ్ 3 నుంచి గ్రేడ్1కు పెంచింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపాలిటీ హోదాను కూడా గ్రేడ్ 1 నుంచి సెలక్షన్ గ్రేడ్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ నిర్ణయాలు తక్షణం అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.