మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ అసెంబ్లీలో వాడీ వేడీగా చర్చ జరిగింది. ఈ విషయంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. గుజరాత్ సబర్మతి, గంగా, యమునా నదుల ప్రాజెక్టులను ఉదాహరిస్తూ.. మూసీ పునరుద్ధరణ ఆవశ్యకత గురించి చెప్పారు. అందులో భాగంగా తొలి దశలో మార్చి 31 లోగా.. 21 కిలో మీటర్ల మేర మూసీ ప్రక్షాళన పనులు మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా 51 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్లు కూడా నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సంక్రాంతిలోగా డీపీఆర్పై స్పష్టత వస్తుందని చెప్పారు.