Hyderabad Metro Overstay Charges: మెట్రోలో ప్రయాణించేవారికి బ్యాడ్ న్యూస్. ఇకపై స్టేషన్లలో ఎక్కువసేపు గడిపితే జేబుకు చిల్లు తప్పదు. కొత్త నిబంధనల ప్రకారం, టికెట్ కొని రెండు గంటల కన్నా ఎక్కువ సమయం స్టేషన్లలో ఉంటే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే. రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయమని మెట్రో యాజమాన్యం చెబుతున్నా, ప్రయాణికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో రైళ్లు ఆలస్యం అయ్యి ఎక్కువ సమయం ఉండాల్సి వస్తే.. అప్పుడు కూడా ప్రయాణికుల వద్ద నుంచి అదనపు చార్జీలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.