మేడారం మహా జాతరకి రంగం సిద్ధమైంది. భక్తుల రద్దీని ఆసరా చేసుకుని కొందరు రూమ్ రెట్లు విపరీతంగా పెంచేశారు. ఏసీ రూమ్ కు రోజుకు రూ.5 వేలు, నాన్ ఏసీ రూమ్ కు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. టెంట్లకు కూడా అధిక మొత్తాలు తీసుకుంటున్నారు. అధికారులు జోక్యం చేసుకుని భక్తులను ఈ దోపిడీ నుంచి కాపాడాలని కోరుతున్నారు. ప్రభుత్వమే ధరలు ఫిక్స్ చేయాలంటున్నారు.