సంక్రాంతికి హైదరాబాద్-విజయవాడ హైవేపై టోల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడంపై చర్చ జరుగుతోంది. అయితే, మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కూడా టోల్ మినహాయింపుపై ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇది కేవలం ఒక వర్గానికి కాదని, అందరి సౌకర్యార్థమేనని ఆయన స్పష్టం చేశారు.