వచ్చే సంవత్సరం జరగనున్న మేడారం మహా జాతరకు తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జాతర జరిగే నాలుగు రోజుల్లొ సుమారు కోటిన్నర మంది భక్తుల వస్తారని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో వీరి కోసం 1,050 ఎకరాలను పార్కింగ్ కోసం, 49 చోట్ల పార్కింగ్ స్థలాలు గుర్తించింది. అలానే 12 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనుంది. జాతర కోసం రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతుంది. భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంటుంది.