Medaram Mahajatara 2025: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే ఈ గిరిజన జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కాకతీయ రాజుల కాలం నాటి సమ్మక్క సారలమ్మల త్యాగాలను స్మరించుకుంటూ ఈ జాతరను ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. దీనిని తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు.