మేడారం మహాజాతర ముగియగా.. అక్కడ పేరుకుపోయిన టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించడం అధికారులకు సవాల్గా మారింది. సుమారు 3 వేల టన్నుల చెత్తలో ప్లాస్టిక్, జంతు వ్యర్థాలు అధికంగా ఉన్నాయి. కోళ్లు, మేకల తలకాయలు, తోళ్లు క్లీనింగ్ చేసేవారికి ఇబ్బంది కరంగా మారాయి. ఆదివాసీ గ్రామాల్లో దుర్గంధం వ్యాపించకుండా ఉండేందుకు 6 వేల మంది పారిశుధ్య కార్మికులు క్లీనింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు.